Tuesday, November 24, 2015

ఎకానమి


1.జాతీయాభివృద్ది మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసారు?
1.1950 2.1951 3.1952 4.ఏదీ కాదు
జవాబు:3

2.ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్థాపించడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య [మినిమం]?
1.ఒకటి 2.రెండు 3.అయిదు 4.ఏడు
జవాబు:4

3.8వ పంచవర్ష కాలంలో మొదటిసారి ఏ అభివృద్దికి ప్రాధాన్యం ఇచ్చారు?
1.మాతా,శిశు 2.వ్య్వసాయ 3.మానవ వనరుల 4.కుఠీర పరిశ్రమల
జవాబు:3

4."గరీబీ హఠావో" ఏ ప్రణాళికా కాలపు నినాదం?
1.4వ 2.5వ 3.3వ 4.2వ
జవాబు:1

5.నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ ప్రణాళికా కాలంలో మొదలైంది?
1.1వ 2.2వ 3.3వ 4.4వ
జవాబు:1

6.సెంట్రల్ ఆసియాకి చెందిన అబ్దుల్ రఝాక్ అనే యాత్రికుడు కింది వస్తువులని కొని, తనతో తీస్కెల్లడానికి విజయనగర సామ్రాజ్యం వచ్చాడు
1.దంతపు వస్తువులు 2.చిత్రలేఖనాలు 3.మందులు 4.వస్త్రాలు
జవాబు:4

7.ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకశక్తికి గీటు రాయి?
1.GDP 2.GNP 3.NNP 4.NDP
జవాబు:2
ఒక దేశ ఆర్థిక పరిస్థితికి ఇదే ఇండికేటర్. GDP దేశంలో ఉత్పత్తిని చెప్తుంది. కానీ GNP ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ విదేశాల్లో చేసిన ఉత్పత్తిని కూడా అకౌంట్ లోకి తీస్కుంటుంది. ఒక దేశపు GDP మరియు GNP తేడా ఎక్కువ ఉంటే ఆ దేశం "అంతర్జాతీయ" వర్తకం, ఉత్పత్తి ఎక్కువ అని అర్థం.

8.ఉత్పత్తి కారకాలలో తప్పుగా ఇవ్వబడింది ఏది?
1.భూమి 2.కార్మికులు 3.పారిశ్రామిక చొరవ 4.ఏదీ కాదు
జవాబు:4
ఆప్షన్స్ 3 కూడా ఉత్పత్తికారకాలే

9.అమర్థ్యసేన్ కి ఆర్థికశాస్త్రంలో నోబుల్ ఎప్పుడు వచ్చింది? [ఇప్పటికీ ఆర్థిక శాస్త్రంలో ఇండియానుండి నోబుల్ ఈయనదే!]
1.2000 2.1998 3.1996 4.1994
జవాబు:2

10.జాతీయాదయం విషయంలో సరి కానిది?
1.బదిలీ చెల్లింపులు లెక్కలోకి తీస్కోకూడదు 2.చట్టవ్యతిరేకంగా పొందిన ఆదాయాన్ని జాతీయాదాయంలో కలపరాదు 3.ఉచిత సేవలు జాతీయాదాయంలో కలపాలి 4.అంతిమ వస్తువులన్నింటినీ పరిగణలోకి తీస్కోవాలి.
జవాబు:3


11.
 "డిస్పోసబుల్ ఇన్‌కం" అంటే ఏమిటి?
1.మందిరాలకి విరాళం గా ఇచ్చే ఆదాయం 2.ప్రభుత్వానికి పన్నులు కట్టగా మిగిలిన ఆదాయం 3.ప్రభుత్వం వృద్దులకి పెన్షన్ రూపంలో ఇచ్చేది 4. ఏదీ కాదు
జవాబు:2

12.భారత్ లో జాతీయాదాయాన్ని లెక్కగట్టేది?
1.ఆర్థిక సంఘం 2.ప్రణాళికా సంఘం 3.కేంద్ర గణాంక సంస్థ 4.కేంద్ర అభివృద్ది మండలి
జవాబు:3
CSO

13."వినియోగదారులు మానవ వనరుల నుండి లేదా భౌతికవనరులనుండి పోందే వస్తుసేవల మొత్తమే జాతీయాదాయం" అన్నదెవరు?
1.పిగూ 2.మార్షల్ 3.రాజ్ కృష్ణ 4.ఏదీ కాదు
జవాబు:4
ప్రొ. ఫిషర్ గారు ఉత్పత్తి కి బదులు "వినియోగాన్ని" బేస్ చేస్కొని డెఫినిషన్ ఇచ్చారు.
మార్షల్ గారు "ఉత్పత్తి" ని బేస్ చేస్కొని జాతీయాదాయం కి డెఫినిషన్ ఇచ్చారు. [ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తువులు మరియు సేవల సమూహమే జాతీయాదాయం]
పిగూ: పిగూ ఉద్దశ్యంలో "ద్రవ్యంతో కొల్వగల వస్తు, సేవల ఉత్పత్తి మొత్తమే జాతీయాదాయం" [ఒక భార్య భర్తకి చేసే సేవలు జాతీయ ఆదాయం కాదు. కానీ అదే స్త్రీ, ఒక టీచర్ గా చేసే సేవ జాతీయ ఆదాయం కిందకి వస్తుంది.]

14.ఒక దేశ జాతీయ ఆదాయం 110 కోట్లు, ఆ దేశ జనాభా 11 కోట్లు. ఆ దేశ తలసరి ఆదాయం ఎంత?
1.99 2.10 3.11 4.ఏదీ కాదు
జవాబు:2
తలసరి ఆదాయం = జాతీయాదాయం/దేశజనాభా

15.భారత్‌లో శాస్త్రీయంగా జాతీయాదాయాన్ని లెక్కగట్టింది ఎవరు?
1.నౌరోజీ 2.వీ.కే.ఆర్.వీ రావ్ 3.మహాలనోబిస్ 4.ఏదీ కాదు
జవాబు:2
నౌరోజీ గారి లెక్కలు అశాస్త్రీయమైనవి.

16.ఆర్థిక వ్యవస్థ లోని ప్రధాన రంగాలలోని "ప్రాథమిక రంగంలో" తప్పుగా ఇవ్వబడినది ఏది?
1.వ్యవసాయం 2.అటవీసంపద 3.గనుల తవ్వకం 4.ఏదీ కాదు
జవాబు:4
గనుల తవ్వకం ప్రాథమిక రంగంలోకే వస్తుంది.
ప్రాథమిక రంగం:
1.వ్య్వసాయం, 2.అటవీ సంపద 3.మత్స్య సంపద 4.గనుల తవ్వకం.
సహజవనరులని ప్రత్యక్షంగా ఉపయోగించుకొనేది ప్రాథిమిక రంగం.రెండో రంగం వస్తువులని తయారుచేస్తుంది. మూడో రంగం సేవలని తయారు చేస్తుంది.
మనకి సాధారణంగా 3 రంగాలున్నాయ్. అవి 3 కాకుండా ఇంకో రెండు కూడా ఉన్నాయ్.
1.పారిశ్రామిక రంగం: ప్రాథమిక రంగంలోని గనుల తవ్వకం తీసి ద్వితీయ రంగానికి కలిపితే వస్తుంది.
2.వ్యవసాయ రంగం: ప్రాథమిక రంగంలోని గనుల తవ్వకం తీసి వేస్తే వ్యవసాయ రంగం వస్తుంది.

17.అర్థశాస్థ్రంలో తొలి నోబుల్ బహుమతి ఎవరిది?
1.అమర్యసేన్ 2.రగ్నార్ ఫ్రిష్ 3.మార్షల్ 4.ఫిషర్
జవాబు:2

18.మనీ లాండరింగ్ అంటే?
1.ప్రభుత్వ అనుమతి లేకుండా డబ్బు విదేశాలలో దాచుకోడం
2.బ్లాక్ మనీ ని వైట్ మనీగా మార్చుకోడం
3.చట్టవ్యతిరేకంగా వచ్చిన డబ్బును అప్పులకి తిప్పడం
4.ఏదీ కాదు?
జవాబు:1

1."సమ్మిళిత వృద్ధి" లక్ష్య సాధనకి ఏ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు?
1.6వ 4.7వ 3.11వ 4.7వ
జవాబు:3

2.వాస్తవిక వేతనం అంటే ?
1. యజమాని శ్రామికుడికి చెల్లించే ద్రవ్యవేతనం
2. శ్రామికుడు పొందిన వేతనానికి ఉండే కొనుగోలు శక్తి
3. శ్రామికుడి శ్రమకు యజమాని చెల్లించే నిజ వేతనం
4. యజమాని పొందిన వాస్తవ ఆదాయంలో శ్రామికుడి వాటా
జవాబు:2

3.1933లో అర్థశాస్త్రంలో "మైక్రో, మాక్రో" అను పదాలని ఉపయోగించిన శాస్త్రవేత్త?
1.జేమ్‌స్ టోబిన్ 2.రగ్నార్ ఫ్రిస్క్ 3.ఫిషర్ 4.గర్లీ
జవాబు:2


4.
వస్తువు ధరలో మార్పు ఫలితంగా దాని వినియోగంలో మార్పు రానట్లయితే. వస్తువు డిమాండ్‌ ఏ విధంగా ఉంటుంది?
1. సంపూర్ణ వ్యాకోచత్వం 2. సంపూర్ణ అవ్యాకోచత్వం
3. అసంపూర్ణ వ్యాకోచత్వం 4. అసంపూర్ణ అవ్యాకోచత్వం
జవాబు:2

5.కిందివాటిలో దేనికి సంభంధించిన ఆదాయాన్ని లెక్కపెట్టడానికి "వ్యయ పద్దతి" పాటిస్తారు?
1.వ్య్వసాయరంగం 2.గనుల రంగం 3.నిర్మాణ రంగం 4.రవాణారంగం
జవాబు:3


6.
కిందివాటిలో "ద్వితీయ రంగంలోనికి" రానిది?
1.విద్యుత్, నీటి సరఫరా 2.నిర్మాణ రంగం 3.గనుల క్వారీయింగ్ 4.ఉత్పాదక రంగం
జవాబు:3


7.
జీ.డీ.పీ + విదేశాలనుండి వచ్చే నికర కారకాల ఆదాయం = ?
1.స్థూల జాతీయోత్పత్తి 2.నికర జాతీయోత్పత్తి 3.నికర దేశీయోత్పత్తి 4.తలసరి ఆదాయం
జవాబు:1


8.
ఏ పరిస్థితులలో ప్రస్థుత ధరల వద్ద జాతీయాదాయం, స్థిర ధరల వద్ద జాతీయాదాయం కంటే ఎక్కువ?
1.పెరుగుతున్న ధరలు 2.తగ్గుతున్న ధరలు 3.స్థిరంగా ఉన్న ధరలు 4.మారుతున్న ఖర్చులు
జవాబు:1


9.
భారతదేశంలో వ్యవసాయ రంగంలోని ఉత్పత్తి విలువని లెక్కపెట్టడానికి కిందివాటిలోని ఏ పద్దతి ఉపయోగిస్తారు?
1.నికర ఆదాయ పద్దతి 2.నికర ఆదాయ మరియు వ్యయ పద్దతి 3.నికర ఉత్పత్తి పద్దతి 4.నికర ఉత్పత్తి మరియు ఆదాయ పద్దతి.
జవాబు:3


10.
జాతీయాదాయం అంటే?
1.ప్రభుత్వ ఆదాయం 2.ప్రభుత్వ బడ్జెట్ 3.ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు 4.అన్ని కారకాల మొత్తం ఆదాయం
జవాబు:4


11.
ఒక దేశ తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది?
1.జీ.ఎన్.పీ, జనాభా పెరుగుదల రేటు సమానంగా ఉన్నపుడు
2.జీ.ఎన్.పీ, జనాభా రెండూ తగ్గినపుడు
3.జనాభాతో పోలిస్తే జీ.ఎన్.పీ వేగంగా వృద్దిచెందినపుడు
4.జనాభా కన్నా జీ.ఎన్.పీ తక్కువగా వృద్ది చెందినపుడు
జవాబు:3

12.నికర దేశీయోత్పత్తి ఎల్లపుడూ స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు?
1.మూలధన దిగుబడులని పూర్తిగా నిషేధించలేననందువల్ల
2.పరోక్ష నిరుద్యోగం కారణంగా స్థూల దేశీయోత్పత్తికి గండి పడటం.
3.మూలధన పరికరాలు తరుగుదలకి గురవటం వలన
4.మూలధనం ఉత్పత్తి నిష్పత్తి తక్కువ ఉండటం వలన
జవాబు:3

13.కిందివాటిలో దేన్ని జీ.డీ.పీ లెక్కించడానికి కలుపుతారు?
1.ప్రభుత్వం ప్రజలకి "బాండ్" ని అమ్మిన ధర 2.గృహిని కుటుంబానికి అందించిన సేవలు
3.వాడిన కార్ల డీలర్ అందించిన సేవలు 4.వృద్దులకి చెల్లించే పెన్షన్
జవాబు:3

14.ఒకదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్నకొద్దీ, జాతీయాదాయంలో సేవారంగం వాటా?
1.పెరుగుతుంది 2.తగ్గుతుంది 3.స్థిరం అవుతుంది 4.ఏదీ కాదు
జవాబు:1


15.
మొత్తం జాతీయ వినియోగం అంటే?
1.ప్రభుత్వ వినియోగం 2.ప్రైవేట్ వినియోగం 3.ఎగుమతులు మాత్రమే 4.ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగాల మొత్తం
జవాబు:4


16.
స్థూల జాతీయోత్పత్తిని గణించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకోరు?
1.నికర విదేశీ పెట్టుబడులు 2.ప్రైవేట్ పెట్టుబడులు 3.దేశప్రజల తలసరి ఆదాయం 4.ప్రభుత్వం కొనుగోలుచేసే వస్తువులు
జవాబు:3


17.
కిందివాటిలో జాతీయాదాయం అంటే?
1.మార్కెట్ ధరలవద్ద స్థూల దేశీయోత్పత్తి 2.ఉత్పత్తికారకాలదృష్ట్యా నికర జాతీయోత్పత్తి
3.ఉత్పత్తికారకాలదృష్ట్యా నికర దేశీయోత్పత్తి 4.మార్కెట్ ధరలవద్ద నికర జాతీయోత్పత్తి
జవాబు:2

18. i)2014-15 GDP ని 5.4-5.9 మధ్య ఉండవచ్చు అని మన కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది.
మన GSDP 5.3 అని అంచనా వేశారు
ii)భారతదేశ తలసరి ఆదాయం:88,533, రాష్ట్ర తలసరి ఆదాయం: 1,03,889 గా ఉంది

19.ఏ కమిటీ సిఫారసులమేరకు నాబార్డ్ ని ఏర్పాటు చేశారు?
1.శివరామన్ 2.రంగరాజన్ 3.వంచూ 4.నరసిమ్హన్
జవాబు:1

20.భారత ఆర్థిక వ్యవస్థ ఏరకమైనది?
1.సామ్యవాద ఆర్థిక 2.పెట్టుబడీదారి ఆర్థిక 3.మిశ్రమ ఆర్థిక 4. ఏదీకాదు
జవాబు:3

21."గ్రామీణ మహిళల స్థితిగతులని మెరుగుపరచడం" అనే ఉద్దేశ్యంతో మొదలైంది?
1.DWCRA 2.DPAP 3.SFDA 4.JRY
జవాబు:1

22.నరసిమ్హం కమిటీ దేనికి సంభంధించింది?
1.బ్యాంకింగ్ రంగం 2.ఎనర్జీ రంగం 3.రోడ్ సేఫ్టీ 4.పన్ను సంస్కరణలు
జవాబు: 1

23.ఆర్థిక సంఘం విషయంలో సరికానిది?
1.భారత రాజ్యాంగం యొక్క 280వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
2.ప్రతి ఐదేళ్ళకోసారి నియమిస్తారు. ఈ సంఘంలో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు.
3.ఈ కమిషన్, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాల పై ప్రధానంగా పనిచేస్తుంది.
4.13వ ఆర్ధిక సంఘం వైవి రెడ్డి నేతృత్వంలో 2015 నుండి 2020 వరకు కొనసాగనుంది.
జవాబు:4
14వ సంఘం వైవీ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైంది. 13కి విజయ్ కేల్కర్ నేతృత్వం వహించారు.
మెంబర్స్ రిక్వెస్ట్ వల్ల ఎకానమీని ఈ గ్రూప్‌లో కవర్ చెయ్యట్లేదు.కింద కొంత ఇంఫర్మేషన్ ఇచ్చాను.గ్రూప్1 వారికి పనిచేస్తుంది.
ఈ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది అయితే కొన్ని కేంద్ర పథకాలను రాష్ర్టాలకు అప్పచెప్పింది.ఇది ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో తీస్కోడమే అని విమర్శించే వాళ్ళూ ఉన్నారు. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రకి రూ. 385 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి 149.87 కోట్లు విడుదల చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ సర్కారు 1.15[1,15,689] లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించింది.బడ్జెట్‌లో కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటాను[2015-16 అంచనా] 12,823.25 కోట్ల రూపాయలుగా లెక్క చూపారు. వాస్తవానికి కేంద్రం పెంచిన 42 శాతం పెంచిన వాటా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ఆదాయం కింద 15,198 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 14వ ఆర్థిక సంఘం నిబంధనలతో అది 12,823 కోట్లకు తగ్గిపోయిందని సంబంధిత అధికారవర్గాల అభిప్రాయం.తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకూ 2.939 శాతం చొప్పున సేవా పన్నుల్లో వాటా రాగా, 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం అది 2.50 శాతానికి కోత పడినట్లు లెక్క అని వీళ్ళ అభిప్రాయం.వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ తదితర పథకాల అమలులో ఈ కోతయొక్క ప్రభావం ఉంటుందని కూడా అనుకుంటున్నారు. దీనికి తోడు మన రాష్ట్ర అప్పు 61,711 కోట్లు గా ప్రస్తుతం చూపించారు. పూర్తిగా ఆంధ్ర, తెలంగాణా అప్పులు విభజించబడలేదు. విభజించాక ఈ అప్పు పెరగొచ్చు. ఈ అప్పుకు కట్టే వడ్డీ 7958 కోట్లు! అంటే బడ్జెట్‌లో 7% వడ్డీలకే వెల్తుంది!!
తెలంగాణా బడ్జెట్ 2015-16:
-వార్షిక బడ్జెట్: రూ.1,15,689 కోట్లు
-ప్రణాళిక వ్యయం: రూ.52,383 కోట్లు
-ప్రణాళికేతర వ్యయం: రూ.63,306 కోట్లు
-ఆర్థిక మిగులు: రూ.531 కోట్లు
-మిషన్ కాకతీయ, చిన్ననీటిపారుదల: 2083 కోట్లు
-వాటర్‌గ్రిడ్: రూ.4,000 కోట్లు

24.ప్రణాళికాసంఘం మొదటి అధ్యక్షుడు?
1.బాబూ రాజేంద్రప్రసాద్ 2.టీ.ఎన్ శేషు 3.నెహ్రూ 4.మోంటెక్ సింగ్ అహ్లువాలియా
జవాబు: 3

25.మొదటి పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందిచబడింది?
1.మహలనోబిస్ 2.గాడ్గిల్ 3.నెహ్రూ 4.హరాడ్-డోమర్
జవాబు: 4

No comments:

Post a Comment